ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

సముద్ర తీరాల వద్ద గట్టి బందోబస్తు

ABN, First Publish Date - 2022-11-07T23:46:27+05:30

పల్లెపాలెం, మోటుపల్లి, పెదగంజాం సముద్ర తీరాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ కట్టా అనూక్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

చినగంజాం, నవంబరు 7: పల్లెపాలెం, మోటుపల్లి, పెదగంజాం సముద్ర తీరాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ కట్టా అనూక్‌ తెలిపారు. మోటుపల్లి, పల్లెపాలెం, పెదగంజాం సముద్రతీరాలను సోమవారం ఆయన పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. మంగళవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్రస్నానాలకు వచ్చే భక్తులు పలు జాగ్రత్తలు తీసుకొని స్నానాలు అచరించాలని ఎస్‌ఐ పేర్కొన్నారు. లోతుకు వెళ్లి స్నానాలు చేయరాదని సూచించారు. ప్రమాదాలు జరగకుండా మైరన్‌ పోలీసులతో పాటు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. భక్తులు పోలీసుల సూచనలు పాటిస్తూ స్నానాలు ఆచరించాలని ఎస్‌ఐ కోరారు.

భక్తులకు సేవ చేయటంలోనే ఆనందం

చీరాల, నవంబరు 7: భక్తులకు సేవచేయటం అదృష్టంగా భావిస్తు న్నామని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎంఎం కొండయ్య చెప్పారు. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా మండల పరిధిలోని వాడరేవుకు సోమవారం సముద్రస్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తులకు టీడీపీ ఆధ్వర్యంలో అల్పాహార ప్రసాదం, మంచినీరు అందజేశారు. కొండయ్య చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తీరంలో ఏర్పాట్లను కొండయ్య పరిశీలించి భక్తులతో మాట్లాడారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్తీకమాసం పూర్తయ్యేవరకు తమవంతు బాధ్యతగా భక్తులకు సహాయ, సహకారాలు అందించాలని సూచిం చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - 2022-11-07T23:46:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!