AP News: 12న పోలవరానికి కేంద్ర జలసంఘం
ABN, First Publish Date - 2022-05-07T22:40:44+05:30
పోలవరం ప్రాజెక్టులో అత్యంత ముఖ్యమైన డయాఫ్రం వాల్ మరమ్మతు పనులను పరిశీలించేందుకు 12న కేంద్ర జలసంఘం
అమరావతి: పోలవరం ప్రాజెక్టులో అత్యంత ముఖ్యమైన డయాఫ్రం వాల్ మరమ్మతు పనులను పరిశీలించేందుకు 12న కేంద్ర జలసంఘం, 17న డ్యాం డిజైన్ రివ్యూ ప్యానల్ (డీడీఆర్పీ) బృందాలు రానున్నాయి. రాష్ట్ర జల వనరుల శాఖ చేపట్టిన డయాఫ్రం వాల్ మరమ్మతు పనులు పూర్తి స్థాయిలో సమీక్షించేందుకు సీనియర్ అధికారి షరీఫ్ ఆధ్వర్యంలో జలసంఘం, ఏబీ పాండ్యా నేతృత్వంలో డీడీఆర్పీ బృందాలు రాష్ట్రానికి వస్తున్నాయి