ఆటోను ఢీకొన్న వ్యాన్...ముగ్గురు కూలీలకు గాయాలు

ABN , First Publish Date - 2022-05-06T16:52:57+05:30 IST

జిల్లాలోని తిరువూరు మండలం కాకర్ల గ్రామ శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు.

ఆటోను ఢీకొన్న వ్యాన్...ముగ్గురు కూలీలకు గాయాలు

ఎన్టీఆర్ జిల్లా: జిల్లాలోని తిరువూరు మండలం కాకర్ల గ్రామ శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. మామిడి కోతకు వెళుతున్న ఆటోను వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 15 మంది కూలీలు ఉన్నారు. వీరంతా మండలంలోని రాయిగూడెం నుండి పోలిశెట్టిపాడు మామిడి కోతలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని విజయవాడకు తరలించారు. ప్రమాదానికి కారణమైన వ్యానుతో సహా డ్రైవర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Read more