Nellore: వైభవంగా సాగుతోన్న పెంచలకోన బ్రహ్మోత్సవాలు
ABN, First Publish Date - 2022-05-14T17:17:15+05:30
జిల్లాలోని రాపూరు మండలంలో పెంచలకోన బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.
నెల్లూరు: జిల్లాలోని రాపూరు మండలంలో పెంచలకోన బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం స్వామి వారికి సింహ వాహన సేవ నిర్వహించారు. రాత్రి ప్రధాన ఘట్టమైన (నృసింహుని జయంతి) బంగారు గరుడ వాహనంపై భక్తులకు శ్రీపెనుశిల లక్ష్మీనృసింహస్వామి దర్శనమివ్వనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవార్లకు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.