కావలి కలికి తురాయి యానాదిరెడ్డి

ABN , First Publish Date - 2022-05-06T03:27:33+05:30 IST

కావలి కలికి తురాయి కలికి యానాది రెడ్డి అని ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మాజీ మంత్రి యా

కావలి కలికి తురాయి యానాదిరెడ్డి
కలికి యానాదిరెడ్డి చిత్రపటం వద్ద నివా ళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి, తదితరులు

- ఎమ్మెల్యే ప్రతాప్‌

కావలిటౌన్‌, మే5: కావలి కలికి తురాయి కలికి యానాది రెడ్డి అని ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మాజీ మంత్రి యానాదిరెడ్డి 16వ వర్ధంతిని కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో బ్రిడ్జి కూడలిలోని కలికి విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ముందుగా కలికి విగ్రహానికి ఎమ్మెల్యేతోపాటు ఏఎంసీ చైర్మన్‌ మన్నెమాల సుకుమార్‌ రెడ్డి, దగ్గుమాటి కృష్ణారెడ్డి, కలికి అభిమానులు, వైసీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం  జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ యానా దిరెడ్డి మొదట సమితి ప్రెసిడెంట్‌గా, ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి  చేశారన్నారు. కృష్ణారెడ్డి తదితరులు మాట్లాడారు. అలాగే ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో కలికి చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఏరియా వైద్యశాల వద్ద అన్నదానాన్ని ఎమ్మెల్యే ప్రారం భించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ మన్నెమాల సుకుమార్‌రెడ్డి, కనమర్లపూడి నారాయణ, శ్రీరాం మాల్యాద్రి, కుందుర్తి బ్రదర్స్‌, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, అమరా వేదగిరి, తిరివీధి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 


Read more