మంత్రి కాకాణి సొంత ఇలాకాలో రెచ్చిపోతున్న గ్రావెల్ మాఫియా
ABN, First Publish Date - 2022-05-05T15:21:56+05:30
మంత్రి కాకాణి సొంత ఇలాకాలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో తవ్వకాలు జరుగుతున్నాయి.
నెల్లూరు: మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సొంత ఇలాకాలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. వారం రోజులుగా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం భూముల్లో భారీగా తవ్వకాలు చేపట్టారు. గతంలో వీఎస్యూ అధికారులు ట్రాక్టర్ను పట్టుకుని, ఎస్పీతో సహా పలువురు అధికారులకు ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యం. కాగా... వీఎస్యూ భూముల్లో అక్రమ గ్రావెల్ తవ్వకాలపై మంత్రి కాకాణి సీరియస్ అయ్యారు. ఎంతటివారైనా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.