శవ రాజకీయాలతో పుట్టిన పార్టీ వైసీపీ: నారా లోకేష్
ABN, First Publish Date - 2022-05-02T23:52:33+05:30
శవ రాజకీయాలతో పుట్టిన పార్టీ వైసీపీ అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.
గుంటూరు: శవ రాజకీయాలతో పుట్టిన పార్టీ వైసీపీ అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపల్లె గ్యాంగ్రేప్ ఘటన బాధాకరమన్నారు.ఇలాంటి అఘాయిత్యాలకు కారణం వైసీపీ నాయకులేనని చెప్పారు.తల్లిని కించపరిచేలా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.బాధిత కుటుంబానికి అండగా ఉందామని వెళ్తే కేసులు పెడుతున్నారని చెప్పారు.చిలకలూరిపేటలో కల్తీమద్యం తాగి ఇద్దరు మృతిచెందారన్నారు. జంగారెడ్డిగూడెంలో కల్తీమద్యం మరణాలను సాధారణ మరణాలన్నారు.. మరి చిలకలూరిపేటలో కల్తీమద్యం ఘటనకు కారణమెవరు? అని ప్రశ్నించారు. ఏపీని గంజాయికి కేరాఫ్ అడ్రస్గా మార్చారని ధ్వజమెత్తారు. ఏపీలో గంజాయి, డ్రగ్స్ను ఎందుకు నివారించలేకపోతున్నారు? అని నిలదీశారు.డ్రగ్స్వెనుక ఉంది వైసీపీ నేతలేనని తెలిపారు. సాక్షి జీతగాడు ఇచ్చిన స్క్రిప్ట్ను వైసీపీ నేతలు చదువుతున్నారని నారా లోకేష్ మండిపడ్డారు.