-
-
Home » Andhra Pradesh » nara lokesh cm jagan tdp ycp-MRGS-AndhraPradesh
-
జెండా ఊపి ప్రారంభించిన వాహనాలన్నీ ఎక్కడికి పోయాయి: Lokesh
ABN , First Publish Date - 2022-05-05T16:32:08+05:30 IST
జెండా ఊపి ప్రారంభించిన వాహనాలన్నీ ఎక్కడికి పోయాయి: Lokesh
అమరావతి: రుయాలో అంబులెన్స్ మాఫియా అరాచకం చూశామని టీడీపీ నారా లోకేష్ మండిపడ్డారు. విశాఖ జీజీహెచ్లో తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల మాఫియా దాడి చూశామన్నారు. ఉదయగిరిలో పోస్టుమార్టం కోసం రూ.15వేలు డిమాండ్ చేశారని ఆయన ఆరోపించారు. రోజుకో అమానుష ఘటన జరుగుతున్నా ప్రభుత్వ తీరులో మార్పులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా సంగంలో మరో అమానవీయ ఘటన చోటుచేసుకుందన్నారు. బిడ్డ మృతదేహం తరలించేందుకు అంబులెన్స్ లేక బైక్పైనే తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. జెండా ఊపి ప్రారంభించిన వాహనాలన్నీ ఎక్కడికి పోయాయి జగన్? అని లోకేష్ ప్రశ్నించారు. అలాగే అమానవీయ ఘటనలపై ఒక్కసారైనా సమీక్ష చేశారా? అని ప్రశ్నించారు.