నందికొట్కూరులో మునిసిపాలిటీ అధికారుల దౌర్జన్యం
ABN, First Publish Date - 2022-05-12T17:39:15+05:30
జిల్లాలోని నందికొట్కూరులో మునిసిపాలిటీ అధికారులు దౌర్జన్యానికి పాల్పడ్డారు.
నంద్యాల: జిల్లాలోని నందికొట్కూరులో మునిసిపాలిటీ అధికారులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. పగిడ్యాల రోడ్డులోని డ్రైనేజీ కాలువలపై ఉన్న బండలను జేసీబీలతో తొలగించేందుకు అధికారులు యత్నించారు. అయితే ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే తొలగిస్తున్నారంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. గతంలో ఆక్రమణ పన్నును అధికారులు వసూలు చేసినట్లు స్థానికులు తెలిపారు.