-
-
Home » Andhra Pradesh » ms raju fires on cm jagan-MRGS-AndhraPradesh
-
jagan ఫ్యాక్షన్ గోడలు బద్దలు కొట్టే రోజులు దగ్గర్లోనే..: MS Raju
ABN , First Publish Date - 2022-05-04T00:51:20+05:30 IST
AP అత్యాచారప్రదేశ్గా మారిందని tdp ఎస్సీ సెల్ అధ్యక్షుడు MS Raju అన్నారు.
అమరావతి: ఏపీ అత్యాచారప్రదేశ్గా మారిందని టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్.రాజు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. CM Jaganmohan Reddyకి ఒక్క ఛాన్స్ ఇస్తే మూడేళ్లలో వెయ్యి మందికి పైగా మహిళలపై అత్యాచారాలు జరిగాయన్నారు. దిశ అనే ఒక దిక్కులేని చట్టాన్ని తీసుకువచ్చి మహిళలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆస్పత్రులు, సీఎం కార్యాలయం సమీపంలో రేపిస్టులు చెలరేగిపోతున్నారన్నారు.రేపల్లెలో ముగ్గురు పసిపిల్లలు, భర్త కళ్ల ఎదుట గర్భిణీపై పాశవికంగా అత్యాచారం చేశారన్నారు. సీఎం జగన్ తల్లి, చెల్లెలికి రాష్ట్రంలో రక్షణ లేక తెలంగాణలో నడి రోడ్లపై తిరుగుతున్నారని చెప్పారు.
బాధితులను పరామర్శించడానికి వెళ్లిన టీడీపీ నాయకులపై కేసులు పెడుతున్న ప్రభుత్వం...అత్యాచారాలకు పాల్పడుతున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు...? అని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉన్న వారిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ పాలన చాలా దుర్మార్గంగా ఉందని, ఎప్పుడెప్పుడు ప్రభుత్వం అంతమైపోతుందని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. దుష్టచతుష్టయం జగన్రెడ్డి, సజ్జలరెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డిలు అంతమైతేనే రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు ఉంటాయని తెలిపారు. రేపిస్టులకు అండగా ఉన్న జగన్ ఫ్యాక్షన్ గోడలు ప్రజలు బద్దలుకొట్టే రోజు దగ్గర్లోనే ఉన్నాయని ఎంఎస్.రాజు హెచ్చరించారు.