MP Raghurama: apలోనే అధిక నేరాలు
ABN, First Publish Date - 2022-05-03T21:32:40+05:30
apలోనే ఎక్కువగా నేరాలు జరుగుతున్నాయని National Crime Records అదే విషయాన్ని చెబుతున్నాయని MP Raghurama Krishnaraju అన్నారు.
ఢిల్లీ: ఏపీలోనే ఎక్కువగా నేరాలు జరుగుతున్నాయని నేషనల్ క్రైం రిపోర్టులు అదే విషయాన్ని చెబుతున్నాయని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణమరాజు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో మహిళలపై నేరాలు 2019లో 10వ స్థానంలో ఉంటే.. 2020లో 8వ స్థానానికి చేరిందని మండిపడ్డారు. ఏపీలో ప్రతి 3 గంటలకు దళితులపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు.గంజాయి, లిక్కర్ వల్లే క్రైం రేటు పెరుగుతోందన్నారు.రేషన్ షాపుల్లో బియ్యం తప్ప ఏమైనా దొరుకుతున్నాయని ఎద్దేవా చేశారు. 175 సీట్లు రావాలంటే వైసీపీ, ప్రభుత్వం ప్రక్షాళన జరగాలని ఎంపీ రఘురామ కృష్ణమరాజు వ్యాఖ్యానించారు.