AP News: ఉద్యమాలు చేస్తే జగన్కు భయమెందుకు?: రామకృష్ణ
ABN, First Publish Date - 2022-05-09T00:53:49+05:30
రాష్ట్రంలో ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాలు చేస్తుంటే ముఖ్యమంత్రి జగన్ ఎందుకు భయపడుతున్నారని సీపీఐ
అనంతపురం: రాష్ట్రంలో ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాలు చేస్తుంటే ముఖ్యమంత్రి జగన్ ఎందుకు భయపడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని రకాల వస్తువులపై ధరలు పెంచుతూ ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారన్నారని మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలు తమ నాయకుడు సింహం అని సీఎం జగన్ గురించి గొప్పలు చెప్పుకుంటున్నారనీ, మరి.. రాష్ట్రంలో ప్రజాఉద్యమాలు చేస్తుంటే ఆయన ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ప్రధానమంత్రి మోదీ, అమిత్షా చెప్పినదానికి తల ఊపుతున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.620 కోట్లు ఆర్టీసీ చార్జీలు, రూ.1400 కోట్లు విద్యుత్చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారని రామకృష్ణ మండిపడ్డారు.