-
-
Home » Andhra Pradesh » MLA TDP Sajjala-MRGS-AndhraPradesh
-
TDP కార్యకర్తల ఆశీస్సులూ ఎమ్మెల్యేలు కోరుతున్నారు: సజ్జల
ABN , First Publish Date - 2022-05-12T21:16:57+05:30 IST
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో టీడీపీ వాళ్ల ఇళ్లకూ వెళ్లాలని సీఎం జగన్ ఆదేశించారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
అమరావతి: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో టీడీపీ వాళ్ల ఇళ్లకూ వెళ్లాలని సీఎం జగన్ ఆదేశించారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తల ఆశీస్సులూ ఎమ్మెల్యేలు కోరుతున్నారని తెలిపారు. కొందరు సంక్షేమ పథకాలకు అర్హులు కాకున్నా ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారని, టీడీపీ నేతలు వాటిని వీడియో తీసి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అర్హులైన కౌలు రైతులందరికీ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. రైతులకు శాశ్వత లబ్ది, డిపార్ట్మెంట్కు అకౌంటబులిటీ కోసమే మోటార్లకు మీటర్లు బిగించామని తెలిపారు. మీటర్ల ఏర్పాటుతో కేంద్రం నుంచి ఆర్థిక వెసులుబాటు వస్తుందన్నారు. శ్రీకాకుళంలో చేపట్టిన ప్రయోగం విజయవంతమైందని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తుచేశారు.