బాదుడే బాదుడు నినాదంతో చంద్రబాబును బాదాలా?: మంత్రి Amarnath
ABN, First Publish Date - 2022-05-04T18:31:40+05:30
గడిచిన మూడు సంవత్సరాల తర్వాత చంద్రబాబుకు రాష్ట్రం గుర్తు వచ్చిందని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు.
విశాఖపట్నం: గడిచిన మూడు సంవత్సరాల తర్వాత చంద్రబాబుకు రాష్ట్రం గుర్తు వచ్చిందని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. బాదుడే బాదుడు నినాదంతో చంద్రబాబును బాదాలా? అని ప్రశ్నించారు. 2019లో చంద్రబాబును ప్రజలు బాదారని గుర్తుచేశారు. రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన ఉన్నట్లు ఉందని వ్యాఖ్యలు చేశారు. అప్పన్న ఆలయంలో వీడియో తీసిన వారికి బుద్ధి ఉండాలని మండిపడ్డారు. సింహాచలం వీడియో ఘటనపై విచారణ చేసి, నిజనిజాలు వెల్లడిస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.