Rishikonda, Vizagలో భూకబ్జాలు, అక్రమాల సంగతి తేల్చుతాం: Chandrababu
ABN, First Publish Date - 2022-05-05T22:29:41+05:30
Rishikonda, Vizagలో భూకబ్జాలు, అక్రమాల సంగతి తేల్చుతాం: Chandrababu
విశాఖపట్నం: తన కాన్వాయ్ నిలిపివేయడంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. తాను హత్యలు, గూండాయిజం చేసేవాడిని కాదని, రిషికొండకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ హయాంలో తాము ఎప్పుడూ ఇలా చేయలేదని చంద్రబాబు అన్నారు. తమ పాలనలో పోలీసులు ఇలా వ్యవహరించలేదని, తాము రిషికొండ వెళ్తామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిషికొండ, వైజాగ్లో భూకబ్జాలు, అక్రమాల సంగతి తేల్చుతామని Chandrababu హెచ్చరించారు.