Vijayawada: సీపీఐ కార్యకర్తల అరెస్టు
ABN, First Publish Date - 2022-05-09T17:57:47+05:30
Vijayawada: సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
Vijayawada: సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీపీఐ కార్యాలయం నుంచి సెక్రటేరీయేట్కు నేతలు, కార్యకర్తలు బయలుదేరారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో సీపీఐ కార్యకర్తలు.. పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగి తోపులాట జరిగింది. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు తీరుపై సీపీఐ నేతలు అసహనం వ్యక్తం చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేయడాన్ని తప్పు పట్టారు.