Vijayawada: ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న దేవాదాయశాఖ మంత్రి
ABN, First Publish Date - 2022-05-10T17:28:11+05:30
ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ బెజవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.
Vijayawada: ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ బెజవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అమ్మవారి ఆలయంలో ఆలయ సిబ్బంది, సేవకుల చేతివాటంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సినీనటుడు రాంచరణ్ అభిమానులు ఉండి ఎక్కడంపై మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలపై మంత్రి స్పందించారు. అమ్మవారి సొమ్మును కాజేయాడానికి ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆలయంలో బందోబస్తును మరింత కఠినతరం చేస్తామన్నారు. మూడు సింహాల విషయంలో నిందితులకు త్వరలో శిక్షపడేలా చేస్తామని మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు.