జగన్ను ఒంటరిగా ఎదురించే ధైర్యం టీడీపీకి లేదు: Jogi Ramesh
ABN, First Publish Date - 2022-05-09T20:56:23+05:30
జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్నారు కాబట్టే.. చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని...
Vijayawada: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్నారు కాబట్టే.. చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జగన్ (Jagan)ను ఒంటరిగా ఎదురించే ధైర్యం టీడీపీకి లేదన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీకి రాగలరా? అని మంత్రి ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఏకతాటిపైకి రావాలని పిలుపిచ్చారు. మన బలం చూపించాల్సిన సమయం వచ్చిందని మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు.