Krishna dist.: పేదల ఇళ్ల స్థలాల జియో ట్యాగింగ్కు వరుణుడు అడ్డంకి
ABN, First Publish Date - 2022-05-04T18:30:59+05:30
కృష్ణాజిల్లా: మచిలీపట్నంలో పేదల ఇళ్ల స్థలాల జియో ట్యాగింగ్కు వరుణుడు అడ్డంకయ్యాడు.
కృష్ణాజిల్లా: మచిలీపట్నంలో పేదల ఇళ్ల స్థలాల జియో ట్యాగింగ్కు వరుణుడు అడ్డంకయ్యాడు. జియో ట్యాగింగ్ చేసేందుకు స్థలాల వద్దకు అధికారులు, వాలంటీర్లు చేరుకున్నారు. అయితే వర్షం కురవడంతో ఇళ్ల స్థలాలలో వర్షపు నీరు నిలిచింది. ఇవాళ జియో ట్యాగింగ్ పూర్తయితే గురువారం నుంచి ఇళ్ల నిర్మాణం చేపడదామని లబ్ధిదారులు అనుకున్నారు. అకాల వర్షంతో జియో ట్యాగింగ్ నిలిచిపోయింది.