హద్దు మీరి ప్రవర్తించే అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు: kollu ravindra
ABN, First Publish Date - 2022-05-11T18:36:41+05:30
టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై తప్పుడు కేసులు పెట్టారని
Amaravathi: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై తప్పుడు కేసులు పెట్టారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర (kollu ravindra) ఆరోపించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కొందరు అధికారులు సైతం శృతిమించి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కుటుంబానికి నోటీసులిస్తామంటూ లీకులతో గందరగోళం సృష్టిస్తున్నారని, హద్దు మీరి ప్రవర్తించే అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని గతంలో సభలో అవమానించి పైశాచిక ఆనందం పొందారని, ఇప్పుడు భువనేశ్వరిపై అక్రమ కేసులు బనాయించేలా కుట్ర పన్నుతున్నారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు.