Si suicide case: గోపాలకృష్ణ ఇంటి వద్ద పోలీసుల బందోబస్తు
ABN, First Publish Date - 2022-05-13T15:52:36+05:30
జిల్లాలోని సర్పవరం ఎస్సై గోపాలకృష్ణ సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.
కాకినాడ: జిల్లాలోని సర్పవరం ఎస్సై గోపాలకృష్ణ(Gopala krishna) సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఎస్సై కుటుంబసభ్యులు మీడియాతో మాట్లాడకుండా పోలీసుల చర్యలు తీసుకున్నారు. ఎస్సై ఇంటికి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా.. కుడి కణితిపై రివాల్వర్తో కాల్చుకుని ఎస్సై చనిపోయినట్లు జీజీహెచ్ వైద్యులు ధ్రువీకరించారు. ఆసుపత్రి దగ్గర పోలీసులు మోహరించారు. జీజీహెచ్ లోపలికి మీడియా వెళ్లకుండా ఆంక్షలు విధించారు.
మరోవైపు....అడిషన్ ఎస్పీ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసు ఉద్యోగంలో ఇమడ లేకపోతున్నట్లు ఆత్మహత్యకు ముందు లేఖ రాసినట్లు పోలీసులు వెల్లడించారు. తన విద్యార్హతకు సరిపడా ఉద్యోగం కాదని కొన్నిరోజులుగా సహచరులుతో చెప్పి బాధపడుతున్నట్లు తెలిపారు. ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్నట్లు అడిషనల్ ఎస్పీ పేర్కొన్నారు.