ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఇరగ్గాసిన ఈత కాయలు

ABN, First Publish Date - 2022-05-07T05:43:37+05:30

తంబళ్లపల్లెకు సమీపంలోని మల్లయ్యకొండ అటవీ ప్రాంత సముదాయాల్లో ఈతకాయలు విరగ్గాసాయి. గత ఏడాది చివర్లో కురిసిన వర్షాలకు చెట్లు మంచి కాపు కాశాయి.

మల్లయ్యకొండలో ఈత చెట్టుకు కాసిన కాయలు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

తంబళ్లపల్లె, మే 6: తంబళ్లపల్లెకు సమీపంలోని మల్లయ్యకొండ అటవీ ప్రాంత సముదాయాల్లో ఈతకాయలు విరగ్గాసాయి. గత ఏడాది చివర్లో కురిసిన వర్షాలకు చెట్లు మంచి కాపు కాశాయి. మల్లయ్యకొండ అటవీ ప్రాంతాల్లో ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకూ ఏడాదికొకసారి వేసవిలో మాత్రమే ఈత కాయలు కాస్తాయి. కాయలు లేతగా ఉన్నపుడు ఆకుపచ్చ రంగులో ఉండి, పక్వ దశలో కాషాయ రంగులో, మాగిన తర్వాత లేత ఎరుపు, నలుపు రంగులో ఉంటాయి. ఈత పండ్లలో ఎన్నో ఔషదగుణాలతో పాటు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈత పండ్లు తినడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగుతుంది. అడవి జంతువులు కూడా ఈ పండ్లను ఇష్టంగా తినడం విశేషం. అటవీ సమీప గ్రామ ప్రజలు, స్థానికులు వేసవిలో ఈ అడవిలో దొరికే ఈత పండ్లను సేకరించి విక్రయించడం ద్వారా జీవనోపాధి పొందుతుంటారు. గత రెండేళ్లలో కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన చాలా మంది స్థానికులు మల్లయ్యకొండలో లభించిన ఈత కాయలు విక్రయించి జీవనం సాగించారు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆకతా యిలు మల్లయ్యకొండలో అడవికి నిప్పు పెట్టడంతో చాలా వరకూ ఈత చెట్లతో పాటు, ఇతర ఫలాలనిచ్చే చెట్లు కాలిపోయాయి.  

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!