ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

వివాదాస్పదంగా మారిన భూ వివాదం

ABN, First Publish Date - 2022-11-07T23:43:56+05:30

రామ్‌నగర్‌ వేణుగోపాలస్వామి దేవాలయం సమీపంలో రోడ్డుకు ఆనుకొని కొందరు నిర్మాణాలు చేస్తుండగా రెవెన్యూ, పోలీసు అధికారులు వెళ్లి అడ్డుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

నిర్మాణాలను అడ్డుకున్న పోలీసులు, రెవెన్యూ

రాజంపేటటౌన్‌, నవంబరు 7: రామ్‌నగర్‌ వేణుగోపాలస్వామి దేవాలయం సమీపంలో రోడ్డుకు ఆనుకొని కొందరు నిర్మాణాలు చేస్తుండగా రెవెన్యూ, పోలీసు అధికారులు వెళ్లి అడ్డుకున్నారు. తాము బలహీన వర్గాలకు చెందిన వారమని, తమకు గతంలో పట్టాలు ఇచ్చారని పేర్కొంటూ నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. రెవెన్యూ అధికారుల నుంచి ఎటువంటి పత్రాలు లేకుండా ఎలా నిర్మాణాలు చేస్తారని తహశీల్దారు సుబ్రహ్మణ్యంరెడ్డి, ఎస్‌ఐ లక్ష్మీప్రసాద్‌రెడ్డి, మున్సిపల్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి కట్టడాలను నిలిపివేశారు. దీనికి సంబంధించి తమ వద్ద పత్రాలు ఉన్నాయని బలహీన వర్గాల ప్రజలు పేర్కొనగా ఏవైనా పత్రాలు ఉంటే వాటిని చూపించి తమ అనుమతులు పొందిన తరువాతే ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టాలని, లేదంటే చేయడానికి వీలు లేదని అడ్డుకున్నారు. ఈ విషయమై నిర్మాణదారులకు, అధికారులకు మద్య వాగ్వివాదం చెలరేగింది. ఎట్టకేలకు అధికారులు నిర్మాణాలను ఆపేశారు.

Updated Date - 2022-11-07T23:43:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!