దిశ పేరుతో ప్రచారమే తప్పా.. మహిళల రక్షణేది: జవహర్
ABN, First Publish Date - 2022-05-02T22:59:57+05:30
వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్రెడ్డి దిశ పేరుతో ప్రచారమే చేస్తున్నారు కాని మహిళల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మాజీమంత్రి జవహర్ అన్నారు.
అమరావతి: వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్రెడ్డి దిశ పేరుతో ప్రచారమే చేస్తున్నారు కాని మహిళల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మాజీమంత్రి జవహర్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాధితుల వివరాల గోప్యత గురించి కాదు మా ఆందోళన.. రాష్ట్రంలో మహిళల రక్షణ గాలిలో దీపాలెందుకు అయ్యాయో సీఎం జగన్రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. దిశ పేరుతో ప్రచారానికి పరిమితమయ్యారు తప్పా నిందితులపై తీసుకున్న చర్యలు శున్యమన్నారు. ఫోక్సో చట్టం ద్వారా ఈ రోజు వరకు ఏ ఒక్కరికి పరిహారమెందుకు అందివ్వలేదో చెప్పాలని నిలదీశారు. అత్యాచారాలు, హత్యలకు మూలమైన మద్యం, గంజాయి నాటుసార, డ్రగ్స్ పై చర్యలెందుకు తీసుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. మద్య నిషేధం అటకెక్కించి శాంతి భద్రతలు ఎలా కాపాడతారో చెప్పాలని జవహర్ అన్నారు.