Janasenaతో కలిసి ఏపీలో ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంటున్నాం: జీవీఎల్
ABN, First Publish Date - 2022-05-14T03:28:06+05:30
జనసేనతో కలిసి ఏపీలో ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంటున్నామని ఎంపీ జీవీఎల్ నరసింహరావు చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో
అమరావతి: జనసేనతో కలిసి ఏపీలో ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంటున్నామని ఎంపీ జీవీఎల్ నరసింహరావు చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జాతీయ నాయకత్వంతో జనసేనాని పవన్ మాట్లాడుతున్నారని తెలిపారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. అమరావతి అభివృద్ధి కుంటుపడటం ప్రధాని మోదీకి నచ్చదన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడం జరిగిందన్నారు. రూ.2,500 కోట్లు ఇస్తామని కేంద్రం చెప్పిందని, ఇంకో రూ.వెయ్యి కోట్లు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ప్రకటించారు. పోలవరానికి అవసరమైతే మరిన్ని నిధులు కేంద్రాన్ని కోరవచ్చన్నారు. అమరావతినే ఏపీ రాజధాని అని, సుప్రీంకోర్టుకు వెళ్లినా హైకోర్టు తీర్పులో మార్పు ఉండదని జీవీఎల్ నరసింహరావు చెప్పారు.