AP News: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై జగన్ సమీక్ష
ABN, First Publish Date - 2022-05-09T22:50:44+05:30
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం జగన్ సమీక్ష (Review) నిర్వహించారు. అదేవిధంగా అమరావతి ప్రాంతంలో పనులపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష చేశారు.
అమరావతి: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం జగన్ సమీక్ష (Review) నిర్వహించారు. అదేవిధంగా అమరావతి ప్రాంతంలో పనులపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. కరకట్ట రోడ్డు విస్తరణ పనులపై జగన్ (Jagan) ఆరా తీశారు. విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్ట్కు వనరుల సమీకరణపై చర్చించారు. సుమారు 75 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ప్రతిపాదనలు చేశారు. మెట్రో రైల్ ప్రాజెక్ట్పై నివేదిక ఇవ్వాలని జగన్ ఆదేశించారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో రోడ్ల నిర్మాణంపై దృష్టిపెట్టాలని జగన్ ఆదేశించారు.