ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

జగన్‌ వచ్చాక అత్యాచారాలు పెరిగిపోయాయి: Chandrababu

ABN, First Publish Date - 2022-05-13T02:51:06+05:30

ఈ మూర్ఖుడు వచ్చాక రాష్ట్రంలో అఘాయిత్యాలు పెరిగిపోయాయి. సీఎం సొంత జిల్లాలోని ప్రొద్దుటూరులో ఓ ఎస్సీ మహిళను పది మంది కలిసి అత్యాచారం

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కుప్పం: ‘ఈ మూర్ఖుడు వచ్చాక రాష్ట్రంలో అఘాయిత్యాలు పెరిగిపోయాయి. సీఎం సొంత జిల్లాలోని ప్రొద్దుటూరులో ఓ ఎస్సీ మహిళను పది మంది కలిసి అత్యాచారం చేస్తే పోలీసులు పట్టించుకోలేదు. రాష్ట్రంలో రోజుకో చోట ఇలాంటి అత్యాచార అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి’ అని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ధ్వజమెత్తారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో గురువారం రెండో రోజు పర్యటన కొనసాగింది. గుడుపల్లె మండలంలోని పొగురుపల్లెలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా డ్రగ్స్‌, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుండడంతో అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. తల్లిదండ్రులు పిల్లల్ని బాగా పెంచుకోవాలని, ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు జరగడం సహజమని మహిళా మంత్రి చెప్పడం దారుణమన్నారు. బాబాయిని చంపగలిగే సత్తా ఉన్న ఏకైక నాయకుడు జగన్‌ మాత్రమేనని వ్యాఖ్యానించారు. గొడ్డలి పోటును గుండె పోటుగా మార్చి చెప్పగలిగే నాయకుడు కూడా అతనొక్కడేనని చంద్రబాబు దుయ్యబట్టారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!