మైనార్టీ కమిషన్ చైర్మన్గా ఇక్బాల్ అహ్మద్
ABN, First Publish Date - 2022-05-05T08:52:08+05:30
మైనార్టీ కమిషన్ చైర్మన్గా ఇక్బాల్ అహ్మద్
కలికిరి, మే 4: ఏపీ మైనారిటీ కమిషన్ చైర్మన్గా అన్నమయ్య జిల్లా కలికిరి మండలానికి చెందిన ఇక్బాల్ అహ్మద్ఖాన్ నియమితులయ్యారు. ఈ మేరకు మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఎండీ ఇంతియాజ్ బుధవారం జీవో 56 జారీ చేశారు. ఇక్బాల్ అహ్మద్ పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్లు ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.