Gunturలో బెండ రైతుల ఆందోళన
ABN, First Publish Date - 2022-05-13T17:54:51+05:30
జిల్లాలోని దుగ్గిరాల మండలం మంచికలపూడిలో బెండరైతుల ఆందోళనకు దిగారు.
గుంటూరు: జిల్లాలోని దుగ్గిరాల మండలం మంచికలపూడిలో బెండ రైతులు ఆందోళనకు దిగారు. నాసిరకం విత్తనంతో పంట నష్టపోయామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తెల్ల రంగు కాయలతో ధర పలకడం లేదని ఆవేదన చెందుతున్నారు. నాణ్యత లేని విత్తనాలు విక్రయించిన కంపెనీపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎకరాకు లక్ష రూపాయలు పరిహారం ఇప్పించాలని ప్రభుత్వాన్ని రైతులు కోరారు.