పోరుమామిళ్ల తహసీల్దార్ ఆఫీస్లో Farmer ఆత్మహత్యాయత్నం
ABN, First Publish Date - 2022-05-06T19:36:35+05:30
జిల్లాలోని పోరుమామిళ్ల తహసీల్దార్ ఆఫీస్లో చెన్నారెడ్డి అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
కడప: జిల్లాలోని పోరుమామిళ్ల తహసీల్దార్ ఆఫీస్లో చెన్నారెడ్డి అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చెన్నారెడ్డిపేట గ్రామానికి చెందిన రామసుబ్బారెడ్డి అనే రైతు తమ భూమిని ఆన్లైన్ చేయలేదని మనస్తాపానికి గురయ్యాడు. చాలాకాలంగా ఆఫీసు చుట్టూ తిరిగినా.. భూమి ఆన్లైన్ చేయలేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు... బాధితుడిని పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.