Eluru: రహదారి విషయంలో ఘర్షణ...వ్యక్తి మృతి
ABN, First Publish Date - 2022-05-14T15:05:52+05:30
జిల్లాలోని ముదినేపల్లిలో దారుణం జరిగింది. రహదారి విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
ఏలూరు: జిల్లాలోని ముదినేపల్లిలో దారుణం జరిగింది. రహదారి విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వర్రె నాగేంద్ర(35), అరుగుల మహేష్(27)పై ఇర్ఫాన్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ నాగేంద్ర ఈరోజు ఉదయం మృతి చెందాడు. మహేష్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతుడు నాగేంద్ర మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.