-
-
Home » Andhra Pradesh » Eight people who went fishing in the sea are safe-MRGS-AndhraPradesh
-
APnews: సముద్రంలో చేపలవేటకు వెళ్లిన ఎనిమిది మంది సురక్షితం
ABN , First Publish Date - 2022-05-13T16:12:01+05:30 IST
సముద్రంలో గల్లంతైన బోటు, 8 మంది వేటగాళ్లను కృష్ణా జిల్లా పోలీసులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
విజయవాడ: సముద్రంలో గల్లంతైన బోటు, 8 మంది వేటగాళ్లను కృష్ణా జిల్లా పోలీసులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈనెల 9 నుండి అసని తూఫాను ఉధృతికి బోటు గల్లంతైంది. జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఈరోజు మాలకాయలంక సమీపంలో బోటును గుర్తించిన కృష్ణా జిల్లా పోలీసులు గిలకలదిండి హార్బర్ వద్ద ఒడ్డుకు చేర్చారు. నిషిద్ధ సమయంలో చేపల వేటకు వెళితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.