AP News: దళిత సంక్షేమం టీడీపీతోనే సాధ్యం: జవహర్
ABN, First Publish Date - 2022-05-09T21:51:06+05:30
AP News: దళిత సంక్షేమం టీడీపీతోనే సాధ్యం: జవహర్
అమరావతి: దళిత సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని మాజీ మంత్రి జవహర్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితులు సీఎం జగన్ను నమ్మి మోసపోయారని తెలిపారు. దళితులకు ఉన్నత విద్య ఎండమావిగా మారిందని దుయ్యబట్టారు. జగన్ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అంబేద్కర్ విదేశీ విద్య ఎందుకు దూరమైందో చెప్పాలని ప్రశ్నించారు. పదవి నిలబెట్టుకునేందుకు.. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి దళితులను తాకట్టు పెడుతున్నారని జవహర్ దుయ్యబట్టారు.