బీఫార్మసీ విద్యార్థిని మృతిపై సమగ్ర విచారణ జరపాలి: Ramakrishna
ABN, First Publish Date - 2022-05-06T14:11:52+05:30
శ్రీ సత్యసాయి జిల్లాలో బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని మరణంపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.
అమరావతి: శ్రీ సత్యసాయి జిల్లాలో బీఫార్మసీ విద్యార్థిని తేజస్విని మరణంపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. బీ ఫార్మసీ విద్యార్థిని తేజస్వినిపై సామూహిక అత్యాచారం, హత్య జరిగినట్లు తెలుస్తోందన్నారు. తన కుమార్తె మరణంపై తేజస్విని తల్లి అనుమానం వ్యక్తం చేస్తోందని తెలిపారు. ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకి పెచ్చుమీరుతున్నాయని అన్నారు. పాలన చేతకాక, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను కంట్రోల్ చేయలేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలపై అపవాదులు వేయటం తగదని మండిపడ్డారు. రాష్ట్ర హోంమంత్రి మహిళ అయి ఉండి కూడా, మహిళలపై జరుగుతున్న దురాగతాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం తగదన్నారు. ఒకపక్క మద్యం మత్తులో ఘోరాలు జరుగుతున్నాయని మంత్రులు చెబుతూనే, మరోపక్క ఏపీలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడు సాధిక్ బాషాను తక్షణమే అరెస్టు చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.