పొత్తుల విషయంపై పవన్ వ్యాఖ్యల్లో చిత్తశుద్ధి లేదు: Tulasireddy
ABN, First Publish Date - 2022-05-09T17:25:12+05:30
పొత్తుల విషయంపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో చిత్తశుద్ధి లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు.
అమరావతి: పొత్తుల విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో చిత్తశుద్ధి లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రానికి నెంబర్ వన్ ద్రోహి బీజేపీ... నెంబర్ టూ ద్రోహి వైసీపీ అని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక సాయం ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని, ద్రోహం చేసిందని మండిపడ్డారు. వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతూ బీజేపీ ప్రజలకు భూలోకంలో యమలోకం చూపిస్తోందన్నారు. అటువంటి బీజేపీతో వంద శాతం పొత్తు ఉంటుందంటూ మరొకవైపు ప్రజల కోసమే పొత్తులు అని పవన్ కళ్యాణ్ చెప్పడం హాస్యాస్పదమని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు.