పొత్తుల విషయంలో పవన్కు స్థిరత్వం, చిత్తశుద్ధి లేదు: Tulasi reddy
ABN, First Publish Date - 2022-05-10T16:14:14+05:30
పొత్తుల విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు స్థిరత్వం, చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు.
నెల్లూరు: పొత్తుల విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు స్థిరత్వం, చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... రైతుల పంపుసెట్లకు మీటర్లు బిగిస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం రైతు వ్యతిరేక నిర్ణయమన్నారు. రాష్ట్రానికి మొదటి ద్రోహి బీజేపీ, రెండవ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని వ్యాఖ్యలు చేశారు. రైతుల పంపుసెట్లకు మీటర్లు బిగించడం రైతుల మెడకు ఉరి తాడు బిగించడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఉచిత విద్యుత్ పథకాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ఎత్తి వేసే పథకం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తివేస్తే రైతుల ఆత్మహత్యలు అధికమవుతాయన్నారు. ఎనిమిది సంవత్సరాలుగా బీజేపీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించకుండా పంగనామాలు పెట్టిందని తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు.