Chittoor: కాణిపాకంకు చేరుకున్న ధ్వజస్తంభం కొయ్యి
ABN, First Publish Date - 2022-05-05T19:15:59+05:30
తూర్పు గోదావరి జిల్లా, చింటూరు అడవి నుంచి ధ్వజస్తంభం కొయ్యి కాణిపాకంకు చేరుకుంది.
Chittoor: తూర్పు గోదావరి జిల్లా, చింటూరు అడవి నుంచి ధ్వజస్తంభం కొయ్యి కాణిపాకంకు చేరుకుంది. ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా అధికారులు నూతన ధ్వజస్తంభం ఏర్పాటు చేయనున్నారు. ధ్వజస్తంభం కొయ్యి కాణిపాకంకు చేరిన సందర్భంగా ఆలయ యాజమాన్యం దానికి ప్రత్యేక పూజలు చేసి స్వాగతం పలికింది. స్థానిక శాసనసభ్యుడు ఎంఎస్ బాబు, ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో సురేష్ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. గురువారం సాయంత్రం ఆలయంలో ధ్వజస్తంభం ఏర్పాటు చేయనున్నారు.