ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

APలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు: Chandrababu

ABN, First Publish Date - 2022-05-12T20:00:47+05:30

Jagan అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు.. ఏ ఒక్కరూ ...

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

చిత్తూరు: జగన్ (Jagan) అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు.. ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి Chandrababu విమర్శించారు. గురువారం కుప్పం (kuppam)లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతమని దీనిని అభివృద్ధి చేస్తామన్నారు. టీడీపీ (TDP) హయాంలో విద్యార్థులు చదువుకోవడానికి కళాశాలలు తీసుకొచ్చామన్నారు. వైసీపీ పాలనలో చదువుకున్న విద్యార్థులు..ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 


అంతకుముందు జీతాలు పెంచాలంటూ కుప్పం షాహి గార్మెంట్స్ మహిళా కార్మికులు చంద్రబాబును కలవడానికి కుప్పం R&B అతిథిగృహం వద్దకు వచ్చారు. మూడేళ్లుగా తమకు జీతాలు రూ. 8,500 మాత్రమే ఇస్తున్నారని మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు పెంచమని యాజమాన్యాన్ని అడిగితే పెంచేది లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. R&B అతిథి గృహం వద్ద మహిళా కార్మికులను పోలీసులు ఓదార్చే ప్రయత్నం చేశారు. తమకు జీతాలు పెంచేంతవరకు విధులకు హాజరయ్యేది లేదని మహిళా కార్మికులు తేల్చి చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!