Chandrababuను చూస్తే జాలేస్తుంది: మంత్రి అప్పలరాజు
ABN, First Publish Date - 2022-05-07T02:22:40+05:30
Chandrababuను చూస్తే జాలేస్తుంది: మంత్రి అప్పలరాజు
శ్రీకాకుళం: ANDHRA PRADESH మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై YCP Minister అప్పలరాజు విమర్శలు గుప్పించారు. Chandrababuను చూస్తే జాలేస్తుందని, బాబు సభల్లో జై జగన్ నినాదాలు వినిపిస్తున్నాయని మంత్రి అన్నారు. బాబు భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని, స్వచ్ఛ భారత్ సెస్ను సూచించింది చంద్రబాబు కాదా? అని, ఇంగ్లీష్ మీడియంలో చదివిన లోకేష్ మొద్దుబారిపోయాడా? అని మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు మనవడు ఏ మీడియం చదువుతున్నాడని, రాష్ట్రంలో ప్రతిపక్షం దిగజారిపోయిందని, పొత్తుల కోసం బాబు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని మంత్రి అప్పలరాజు ఆరోపించారు.