Chandrababu పచ్చి అబద్దాల కోరు: కొడాలి నాని
ABN, First Publish Date - 2022-05-10T00:51:41+05:30
ఎన్ని గుంపులొచ్చినా ఎదుర్కొనేందుకు సింహం రెడీగా ఉందని సీఎం జగన్ను ఉద్దేశించి మాజీమంత్రి కొడాలి నాని (Kodali Nani) వ్యాఖ్యానించారు.
అమరావతి: ఎన్ని గుంపులొచ్చినా ఎదుర్కొనేందుకు సింహం రెడీగా ఉందని సీఎం జగన్ను ఉద్దేశించి మాజీమంత్రి కొడాలి నాని (Kodali Nani) వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరు కలిసినా జగన్ను ఏం చేయలేరని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పచ్చి అబద్దాల కోరని దుయ్యబట్టారు. జగన్పై ప్రజల్లో వ్యతిరేకత ఉంటే బాబుకు ఇంకో పార్టీ ఎందుకు? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు 2024 ఎన్నికలు చివరివి అని జోస్యం చెప్పారు. చంద్రబాబుకు అధికారం కావాలి.. పవన్కు డబ్బు కావాలన్నారు. చంద్రబాబు, పవన్తో రాష్ట్రానికి ఏం ప్రయోజనం లేదని కొడాలి నాని ఎద్దేవాచేశారు.