బీజేపీ పొత్తు జనసేనతోనే...: somu veerraju
ABN, First Publish Date - 2022-05-11T19:25:42+05:30
కార్పొరేటర్ కూడా లేని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని...ఏపీలోను బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు స్పష్టం చేశారు.
కర్నూలు: కార్పొరేటర్ కూడా లేని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని... ఏపీలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు(Somu veerraju) స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ దగ్గర నవరత్నాల కంటే ఎక్కువ రత్నాలు ఉన్నాయన్నారు. బీజేపీ పొత్తు జనసేనతోనే అంటూ మరోసారి తేల్చిచెప్పారు. ఏపీలో ఫామిలీ పార్టీలు లేకుండా అద్భుతం జరుగుతోందన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం వద్దే పెండింగ్లో ఉందని చెప్పారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే ఒకే చేసి పంపుతామని సోమువీర్రాజు పేర్కొన్నారు.