విజయనగరం, పార్వతీపురం జిల్లాలపై అసాని ప్రభావం
ABN, First Publish Date - 2022-05-10T19:50:00+05:30
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలపై అసాని తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది.
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలపై అసాని తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. రెండు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. రాజాంలో భారీ వడగంట్ల వాన హోరెత్తించింది. విజయనగరం జిల్లాలో ఈదురు గాలుల ధాటికి చెట్ల కొమ్మలు విరిగిపడిపోతున్నాయి. విద్యుత్ వైర్లపై చెట్ల కొమ్మలు విరిగిపడడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పూసపాటిరేగ, డెంకాడ మండలాల్లోని సాగర తీరం అల్లకల్లోలంగా మారింది. ఎగిసిపడుతున్న కెరటాలతో తీర ప్రాంతంలో అలజడి నెలకొంది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.