అనకాపల్లి జిల్లాలో దారుణం

ABN , First Publish Date - 2022-05-06T14:41:25+05:30 IST

జిల్లాలో దారుణం జరిగింది. ఆరెళ్ళ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.

అనకాపల్లి జిల్లాలో దారుణం

అనకాపల్లి: జిల్లాలో దారుణం జరిగింది. ఆరెళ్ళ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. పక్కింటిలో ఉండే సాయి అనే యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న బాలికను తల్లిదండ్రులు గుర్తించారు. ఎవరో లాకెళ్ళి ఇంతటి దారుణానికి పాల్పడ్డారని బాలిక చెబుతోంది. వెంటనే బాలికను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. 

Read more