మంత్రాలయంలో అక్షయ తృతీయ వేడుకలు
ABN, First Publish Date - 2022-05-03T17:56:17+05:30
జిల్లాలోని మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో అక్షయ తృతీయ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కర్నూలు: జిల్లాలోని మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో అక్షయ తృతీయ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాఘవేంద్రస్వామి మూల బృందావనంతో పాటు మాంచాలమ్మ, పూర్వ పీఠాధిపతుల మూల బృందాలకు శ్రీ గంధంతో ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీ మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తలు ఆలయానికి తరలివచ్చారు.