సమాజసేవ చేయడం అభినందనీయం
ABN, First Publish Date - 2021-02-20T07:12:16+05:30
సమాజంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎన్జీవోలు సమాజసేవ చేయడం అభినందనీయమని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు.
లోకేశ్వరం, ఫిబ్రవరి 19 : సమాజంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎన్జీవోలు సమాజసేవ చేయడం అభినందనీయమని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రం లోకేశ్వరంలో మా అమ్మానాన్న ఫౌండే షన్ ఆధ్వర్యంలో నిర్వహించి 10వ వార్షికోత్సవం కార్యక్రమంలో భాగంగా ఎమ్మె ల్యే విఠల్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మొదట వివిధ జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు ఆట పాటలతో పాటు, మ్యాజిక్ విన్యాసాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. సందర్భంగా ఎమ్మెల్యే విఠల్రెడ్డి మాట్లాడుతూ సమాజసేవ చే యడం చాలా గొప్ప విషయమని అలాంటి ఎన్జీవోల ద్వారా పేదలకు సహాయ పడుతున్న ప్రతి ఒక్కరికి కృజ్ఙతలు తెలిపారు. సందర్భంగా అమ్మనాన్న ఫౌండే షన్ చైర్మన్ ఆంజనేయులు పేదరికంలో పుట్టి పది మందికి సహాయ పడుతూ పలువురి మన్ననలు పొందడం హర్షించ దగ్గ విషయం అన్నారు. కరోనాకాలం లో అమ్మానాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు బియ్యం పంపిణీతో పాటు ఆహారం అందించడం జరిగిందన్నారు. అలాగే బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి మాట్లాడుతూ జీవితంలో ఎన్ని పదవులు ఉన్న డబ్బులు ఉన్న సమాజ సేవ చేయడం గొప్పదని పేర్కొన్నారు. అనంతరం ఆయా జిల్లాల నుంచి వచ్చిన కళాకారులకు శాలువతో సన్మానించి, ఏపీజే అబ్ధుల్కలాం అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీచైర్మన్ లోలం శ్యాంసుందర్, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్రావు, నాయకులు భోజన్న, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.