ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

భారత్-శ్రీలంక సంబంధాలపై మోదీ, రాజపక్స చర్చలు

ABN, First Publish Date - 2021-03-13T23:25:54+05:30

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, శ్రీలంక అధ్యక్షుడు గొటబయ

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స శనివారం టెలిఫోన్ ద్వారా చర్చలు జరిపారు. తాజా పరిణామాలను వీరిద్దరూ సమీక్షించారు. ద్వైపాక్షిక, బహుపాక్షిక సహకారంపై చర్చించారు. కోవిడ్-19 విసురుతున్న సవాళ్ళతోపాటు ఇతర అంశాలపై చర్చించేందుకు ఇరు దేశాల అధికారులు నిరంతరం సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. 


ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స శనివారం టెలిఫోన్ ద్వారా చర్చలు జరిపారు. తాజా పరిణామాలను సమీక్షించి, ద్వైపాక్షిక, బహుపాక్షిక సహకారంపై చర్చించారు. కోవిడ్-19 విసురుతున్న సవాళ్ళతోపాటు ఇతర అంశాలపై చర్చించేందుకు ఇరు దేశాల అధికారులు నిరంతరం సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. 


పొరుగు దేశాలకు పెద్ద పీట అనే విధానాన్ని భారత దేశం అమలు చేస్తోందని, భారత దేశానికి శ్రీలంక చాలా ముఖ్యమైనదని మోదీ చెప్పినట్లు పీఎంఓ పేర్కొంది. 


5 లక్షల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ బహుమతి

శ్రీలంకకు మన దేశం కోవిడ్-19 వ్యాక్సిన్‌ను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. జనవరిలో 5 లక్షల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను బహుమతిగా పంపించింది. ఆ తర్వాత సీరం ఇన్‌స్టిట్యూట్‌తో శ్రీలంక ప్రభుత్వం 10 లక్షల డోసుల వ్యాక్సిన్ కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా 5 లక్షల డోసుల వ్యాక్సిన్ ఫిబ్రవరిలో శ్రీలంకకు చేరింది. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!