ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

కుమార్తెను దారుణంగా చంపిన తండ్రికి ఉరిశిక్ష

ABN, First Publish Date - 2021-02-20T17:23:32+05:30

ఏడాదిన్నర వయస్సున్న కన్నకూతురిని దారుణంగా హత్య చేసిన

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

బెంగళూరు : ఏడాదిన్నర వయస్సున్న కన్నకూతురిని దారుణంగా హత్య చేసిన కేసులో తండ్రికి ఉరిశిక్ష విధిస్తూ గదగ్‌ జిల్లా సెషన్స్‌ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. కర్ణాటకలోని గదగ్‌ జిల్లా రోణ తాలూకా హల్లూర గ్రామానికి చెందిన ప్రశాంతగౌడపాటిల్‌ మైనార్టీ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్ని నెలల తర్వాత భార్యను హింసించడం ప్రారంభించాడు. వేధింపులు తట్టుకోలేని బాధిత మహిళ పునరావాస కేంద్రానికి వెళ్లింది. వీరికి ఒక కుమార్తె కలిగింది. బంధువులు మందలించడంతో కలిసి జీవనం సాగిద్దామని తప్పును ఒప్పుకుంటున్నానని ప్రశాంతగౌడ పాటిల్‌.. రోణలో ఓ అద్దె ఇంట్లో సంసారం పెట్టాడు.


కొన్ని నెలలకే తనపై కేసులు ఉపసంహరించుకోవాలని భార్యపై ఒత్తిడి తీసుకొచ్చాడు. వేధింపులు పునరావృతం కావడంతో భార్య భరణం కోసం కోర్టును ఆశ్రయించింది. దీన్ని జీర్ణించుకోలేని ప్రశాంతగౌడపాటిల్‌ 2015 ఏప్రిల్‌ 6న ఏడాదిన్నర కుమార్తెను గజేంద్రగడ సమీపంలోని కాలకాలేశ్వర కొండపైకి తీసుకెళ్లి గొంతునులిమి దారుణంగా హత్య చేశాడు. సాక్ష్యం లేకుండా చేయాలని మృతదేహాన్ని కాల్చివేశాడు. భర్తపై అనుమానంతో భార్య కేసు పెట్టడంతో దర్యాప్తుచేసిన పోలీసులు తండ్రే హంతకుడని తేల్చారు. ఈ మేరకు జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి రాజశేఖర్‌ వి పాటిల్‌ నిందితుడికి ఉరిశిక్షను ఖరారు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!