మద్యం కేసులో వలంటీర్ అరెస్ట్?
ABN, First Publish Date - 2021-03-14T01:24:12+05:30
జిల్లాలో మద్యం నిల్వ చేసారని అనుమానిస్తున్న వార్డు
గుంటూరు: జిల్లాలో మద్యం నిల్వ చేసారని అనుమానిస్తున్న వార్డు వలంటీర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సత్తెనపల్లిలోని రంగా కాలనీలో మద్యం నిల్వ చేసారనే కచ్చితమైన సమాచారం పోలీసులకు అందింది. దీంతో పోలీసులు అక్కడికి వెళ్ల అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పట్టుకున్నారు. దీనితో సంబంధముందని భావిస్తున్న వార్డు వలంటీర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 20 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.