పోలీసుల అత్యుత్సాహం...ఇద్దరి ఆత్మహత్యాయత్నం
ABN, First Publish Date - 2021-03-13T20:45:54+05:30
పోలీసుల అత్యుత్సాహంతో ఇద్దరు భక్తులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటన
అనంతపురం: పోలీసుల అత్యుత్సాహంతో ఇద్దరు భక్తులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటన జిల్లాలోని తాడిమర్రి మండలంలో జరిగింది. మండలంలోని చిల్లవారిపల్లి గ్రామంలో గల కాటకోటేశ్వరస్వామి వారిని గ్రామస్తులు ఉరేగించారు. అయితే ఈ ఉరేగింపును పోలీసులు అడ్డుకున్నారు. ఆలయ తలుపులు మూసివేయాలంటూ గ్రామస్తులను పోలీసులు ఆదేశించారు. దీంతో పోలీసుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుడి తలుపులు మూసివేశారన్న మనస్థాపంతో చిల్లవారిపల్లి గ్రామానికి చెందిన రామేశ్వరరెడ్డి, బాలిరెడ్డి అనే వ్యక్తులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికులు వెంటనే గమనించి చికిత్స కోసం వీరిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామేశ్వరరెడ్డి, బాలిరెడ్డిలను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పరామర్శించారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.