ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం దావా అర్ధరహితం
ABN, First Publish Date - 2021-03-14T02:33:58+05:30
ఆంధ్రజ్యోతిపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి పరువు
నెల్లూరు: ఆంధ్రజ్యోతిపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి పరువు నష్టం దావా వేయడం అర్థరహితమని మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు. ఎప్పుడో సంవత్సరం క్రితం నిజాన్ని రాసిన ఆంధ్రజ్యోతి పేపర్ పై 100 కోట్లు పరువు నష్టం దావా వేయడం అర్ధరహితమని చింతామోహన్ పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని ఆయన అన్నారు. ఈ రోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని చింతామోహన్ విమర్శించారు.